రేపు సాలూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

73చూసినవారు
రేపు సాలూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి. జి. ఆర్. ఎస్) ను సోమవారం సాలూరులో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం10 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలు స్వయంగా వచ్చి తెలపవచ్చని ఆయన చెప్పారు. అధికారులు అందరూ సాలూరులో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్