సాలూరు శ్యామలంబ జాతరలో శిథిలావస్థ భవనాలపై యాత్రికులు ఎక్కకుండా చూడాలని పార్వతీపురం మన్యం జిల్లా ఇంఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ శోబిక అధికారులను ఆదేశించారు. శ్యామలాంబ ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం సంబంధిత అధికారులతో ఇంఛార్జ్ కలెక్టర్ టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్సవం మే 18 నుండి 20 వరకు మూడు రోజుల పాటు జరుగుతుందన్నారు.