కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక , రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న జరుగు అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నేత సిహెచ్ , రామ్మూర్తి నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం రాజాంలో బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దుచేయాలన్నారు. కనీస వేతనం 26 వేలు చెల్లించాలన్నారు.