సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాజాం మున్సిపల్ కమిషనర్ కే రామప్పల నాయుడు హెచ్చరించారు. బుధవారం ఆయన శానిటరీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. కాలువలు క్లీనింగ్, పారిశుద్ధ్య సేవలు, వ్యాధులు ప్రబలకుండా ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. బాధ్యతగా పనిచేయాలన్నారు. విద్యుత్ లైటింగ్ సిబ్బంది చక్కగా పని చేయాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలన్నారు.