జిల్లాలో కుష్టువ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యాధి వ్యాప్తికి కారణాలను గుర్తించి, వాటిని నివారించాలని సూచించారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా, ఈనెల 18 నుంచి ఆగస్టు 2 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. జిల్లాలో కుష్టువ్యాధి వ్యాప్తి చెందడానికి వీల్లేదని స్పష్టం చేశారు.