రాజాం మండలం బొమ్మినాయుడు వలస గ్రామంలో శుక్రవారం రాత్రి కూటమి నేతలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. 'తల్లికి వందనం' పథకం ద్వారా అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ముగ్గురు పిల్లలకూ నిధులు వచ్చాయని, ఇది ఎంతో ఆనందం కలిగించిందని వారు తెలిపారు.