రాజాం మండలం గురవాం పంచాయతీలోని పరశురాం పేట నుండి కోర్లవలసకు వెళ్లే రహదారి పనులకు శుక్రవారం రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళిమోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాజాం నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిందన్నారు. రాజాం అభివృద్ధి కూటమి తోనే సాధ్యమన్నారు. ప్రతి గ్రామానికి రహదారులు వేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.