మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని రాజాం రూరల్ సీఐ హెచ్. ఉపేంద్రరావు అన్నారు. శనివారం రేగిడి ఆమదాలవలస మండలం పోరాం గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ నాటుసారా, గాంజాయి వల్ల కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు. ఆన్లైన్ మోసాలకు ప్రజల దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.