సంతకవిటి మండలం గుళ్ళ సీతారాంపురంలోని ఆదర్శ రైతు కంబాల దళప్పడు కు 12 కేజీల నవధాన్యాల కిట్ ను యూనిట్ ఇంచార్జి పాత్రుని వెంకటరమణ ఆదివారం పంపిణీ చేశారు. రైతు 6ఎకరాల విస్తీర్ణంలో 18 రకాల నవధాన్యాలు పొలంలో వేసుకోవడం వల్ల పచ్చిరొట్ట ఏపుగా పెరిగి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పచ్చిరొట్ట ఎరువు తయారవుతుందన్నారు. దీనివలన రైతులు ఎరువులు, పురుగులు మందులు వాడకం తగ్గుతుందని తెలిపారు.