ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉపాధి పని ప్రదేశంలో నీరు, నీడ, మెడికల్ కిట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లుకు ఎపిఓ ఆర్. హరినాధ్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం సంతకవిటి మండలం తాలాడ గ్రామంలోని ఉపాధి పనులను ఆయన ఆకస్మకంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎపిఓ మాట్లాడుతూ కొలతలు ప్రకారం పని చేస్తే రోజుకి 307రూపాయలు వస్తుందన్నారు. అనంతరం కూలీలను నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.