రేగడి మండలంలోని విత్తన, ఎరువులు, పురుగుల మందుల ప్రైవేట్ దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ శనివారం తనిఖీ చేశారు. ఖరీఫ్ సీజన్ అయినందున రైతులకు ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అధిక ధరలకు విక్రయాలు చేసినట్లు తెలిస్తే అటువంటి కేంద్రాలను వెంటనే తనిఖీ చేసి సరుకులు విక్రయించకుండా నోటీసులు అందజేయడం జరుగుతుందన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.