మనమిత్ర వాట్సాప్ సేవలపై క్యాంపెయిన్ కార్యక్రమాన్ని వంగర మండలం కోనంగిపాడులో గురువారం చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కల్పిస్తున్న 250 పౌర సేవలపై సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ ధ్రువీకరణ పత్రాలు, రసీదులను పొందవచ్చు అన్నారు. ఈ కరపత్రాలను పంచాయతీ సెక్రటరీ జక్కు సింహాచలం గ్రామ ప్రజలకు అందజేశారు.