అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

58చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సాలూరు రూరల్‌ మండలంలోని ఖరాసవలసలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్‌ఐ పి.నర్సింహమూర్తి విలేకరులకు శనివారం వెల్లడించారు. ఖరాసవలస గ్రామానికి చెందిన ఇల్లాపుదొర ఖరాసమ్మ(39) శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యిందంటూ తన భర్త ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఖరాసమ్మ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి పైడన్నదొర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్