పాచిపెంటలో ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఆర్థిక రుణాల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది అని ఎంపీడీవో బీ. విజయ పాత్రో బుధవారం తెలిపారు. మే 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎస్సీ వర్గానికి చెందిన లబ్ధిదారులు అప్లై చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు ఎంపీడీవో కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.