మన్యం జిల్లాలోని అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు అందిస్తున్న బలవర్ధకమైన ఆహారంతో పాటు అదనంగా పౌష్టికాహారాన్ని (న్యూట్రీషన్)అందించేందుకు అవసరమైన కిట్లను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, ఐసీడిఎస్, డిఆర్డిఏ తదితర అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. చింతపండుకు బదులుగా కాయగూరలను వంటల్లో వినియోగించుకోవాలన్నారు.