సాలూరు మున్సిపాల్టీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శానిటరీ ఇన్స్పెక్టర్కు గురువారం వినతిని అందజేశారు. అనంతరం యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాముడు, శంకరు మాట్లాడుతూ పుస్కాట్ బళ్లు 15 ఏళ్ల నాటివి కావడంతో దాదాపు పూర్తిగా పాడైపోయాయని, వాటితోనే కార్మికులు పనులు నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.