జామి మండల కేంద్రంలో గల డైలీ మార్కెట్ ఆశీలు వసూలుకు గాను జులై 2 న స్థానిక పంచాయతీ కార్యాలయంలో వేలంపాట నిర్వహించనున్నట్లు ఈవోపీఆర్డి శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఔత్సాహికులు అదే రోజు 10 గంటలకు హాజరు కావాలని కోరారు. అలాగే అదే రోజు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చిప్పాడ లక్ష్మీ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.