డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో పర్యటన ముగించుకొని కొత్తవలస మీదుగా శనివారం విశాఖకు వెళుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు అతనిని చూసేందుకు ఎగబడ్డారు. పవన్ కళ్యాణ్ తన అభిమానులకు అభివాదం చేసేందుకు తన కారు పైభాగాన కూర్చొని ప్రజలకు, అభిమానులను నిరుత్సాహపరచకుండా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ మేరకు ఆయనను చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.