ఎల్ కోట మండల పరిధిలో గల రెవెన్యూ గ్రామాల్లో అభ్యంతరం లేని పోరంబోకు భూములను ఆక్రమణ చేసుకుని అక్టోబర్ 2019 నాటికి ఇంటి నిర్మాణాలు చేపట్టిన కుటుంబాలకు సదరు భూములను క్రమబద్ధీకరణ చేయుటకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు తాసిల్దార్ ప్రసాదరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు 2025 డిసెంబర్ 31 వరకు గడువు ఉన్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హత గల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.