రెండు వందల మొక్కలతో ఆరోగ్యప్రద వనం ఏర్పాటు

64చూసినవారు
జియో వ్యవస్థాపకులు బి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్. కోట మండలం పెదఖండేపల్లి శ్రీ గురు వానప్రస్ధంలో 200 మొక్కలతో ఆరోగ్యప్రద వనాన్ని టెక్నో విలేజ్ వ్యవస్థాపకులు చదరం గణేష్ బుధవారం ప్రారంభించారు. ఆరోగ్యం, ఆధ్యాత్మిక సాధనకు ఇలాంటి సామాజిక వనాలు దోహదపడతాయని రామకృష్ణ అన్నారు. బొబ్బిలి లాస్య పుట్టినరోజు సందర్భంగా ఈ వనాన్ని ఏర్పాటు చేశామన్నారు. సిమ్ డైరెక్టర్ విజయలక్ష్మి, హృషికేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్