ఎల్కోట మండలం బొద్దాం నుంచి కళ్లెంపూడి వెళ్ళే రహదారి గుంతలతో నిండిపోయింది. అందువల్ల ప్రజలు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ స్థానికులతో కలిసి గుంతల్లో నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. ప్రభుత్వంతో పాటు అధికారులు రోడ్డు నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించి, పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.