కొత్తవలస వాగ్దేవి కళాశాలలో కరస్పాండెంట్ కోడెల మహేశ్వర రావు, ప్రిన్సిపల్ ఏ ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. 500 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా 300 మంది పలు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా కు సుమారు 50 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శారద కంపెనీ జనరల్ మేనేజర్ సన్యాసిరావు చేతుల మీదుగా దృవపత్రాలు అందజేశారు.