జనసేన పార్టీ బలోపేతానికి జనసైనికులు కృషి చేయాలని మండల జనసేన నాయకులు పిల్ల రామదుర్గ అన్నారు. కొత్తవలస మండలం తుమ్మికాపల్లిలో జనసేన కార్యాలయాన్ని నియోజకవర్గ ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ తో కలిసి ఆదివారం ప్రారంభించారు. జనసైనికులు ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ తరఫున స్థానిక ఎన్నికల్లో గెలుపు దిశగా పోరాడాలని కోరారు. గొరపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.