ఎస్ కోట మండలం వినాయక పల్లిలో ఉపాధి హామీ పని వద్ద వేతనదారులకు, రైతులకు యూనిట్ ఇంచార్జ్ డి కృష్ణ ఆధ్వర్యంలో గురువారం నవధాన్యాల సాగుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ద్రావణాలు, కషాయాలు వినియోగించడం ద్వారా భూసారం పెరగడంతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు పొందవచ్చని వివరించారు. రైతులకు రాయితీపై నవధాన్యాల విత్తనాలు పంపిణీ చేశారు. ఐ సి ఆర్ పి ఎస్. రాము తదితరులు పాల్గొన్నారు.