ఎస్ కోట పట్టణం స్థానిక గొల్లవీధిలో శనివారం శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) వ్యవస్థాపకులు బి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు భాస్కర శర్మ, అయ్యప్ప ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంత్రోచ్ఛారణల నడుమ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.