ఎస్ కోట: గ్రామ సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ

61చూసినవారు
ఎస్ కోట: గ్రామ సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ
ఎస్ కోట మండలం గోపాలపల్లి గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు గురువారం సందర్శించారు. సచివాలయంలో రికార్డులను తనిఖీ చేసి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రెవెన్యూ, హౌసింగ్ కు సంబంధించిన పనులు పురోభివృద్ధి పై ఆరా తీశారు. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ఎంపీపీ నిధులు మంజూరు చేయాలని ఎంపీపీ సోమేశ్వరరావును కోరారు. వైస్ ఎంపీపీ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్