శృంగవరపు కోట మండల కేంద్రంలో ఉన్న ప్రాంతీయ పశు వైద్యశాలలో జూలై ఆరవ తేదీ ఆదివారం నాడు జోనోసిస్ దినోత్సవ సందర్భంగా పెంపుడు కుక్కలకు ప్రత్యేక టీకాలు వెయ్యనున్నట్లు ఏరియా ఆసుపత్రి సహాయ సంచాలకులు చలపతిరావు తెలిపారు. ఈ యాంటీ రేబిస్ టీకా వేయడం ద్వారా కుక్కలకి రెబిస్ వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని తెలిపారు. టీకా వెయ్యడం ద్వారా కలుగు ఉపయోగాలు అవగాహన కల్పించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు.