కౌలు రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కొత్తవలస తాసిల్దార్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మండలంలోని బలిఘట్టంలో కొత్తవలస సబ్ డివిజన్ ఏ డి ఏ విజయ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌలు రైతుల గుర్తింపు సమావేశంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. సమావేశాల్లో గుర్తించిన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. కౌలు రైతులకు అందిస్తున్న రాయితీలను ఏవో మాధురి అవగాహన కల్పించారు.