వేపాడ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్ ఉచిత శిక్షణా తరగతులను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండో విడత శిక్షణా తరగతులకు మరింత మంది మహిళలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.