అందరికి సమానత్వం కల్పించిన మహనీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ అని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. జిల్లాలోని పోలీసు కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.