విజయనగరం జిల్లాలో వినియోగ దారులకు ఉచితంగా ఇసుక సరఫరా కార్యక్రమంలో భాగంగా మూడు ఇసుక నిల్వ యార్దుల ద్వారా 2165 టన్నుల ఇసుక సరఫరా చేయడం జరిగిందని గనుల శాఖ ఉప సంచాలకులు సూర్యచంద్ర రావు తెలిపారు. డెంకాడ మండలం పెద తాడివాడ నిల్వ కేంద్రం నుంచి 1336. 5 ఎం. టీ. లు, కొత్తవలస నుండి 819 ఎం. టీ. లు, బొబ్బిలి నుండి 10 ఎం. టీ. లు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు.