విజయనగరం జిల్లా ప్రజలకు సురక్షిత త్రాగునీటిని అందించడానికి కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ మంగళవారం శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా అనధికారిక ఆర్వో వాటర్ ప్లాంట్లపై దృష్టి సారించారు. జిల్లాలో అన్ని వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. దీంతో ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా మొదలయ్యింది. తాశిల్దార్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు.