తన కుమారుడు శ్రీనివాసరావు మానసికంగా వేధింపులు ఎదుర్కొని పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోరుకొండ గ్రామానికి చెందిన ఎస్.రాము, కుటుంబ సభ్యులు విజయనగరం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం ఫిర్యాదు చేశారు. చరవాణిలో బెదిరింపుల మెసేజులు, వాయిస్లు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 6న జామి మండలం సంత దగ్గర పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు.