పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మున్సిపల్ అధికారులతో గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మున్సిపాలిటీలో ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటికి వెంటనే నోటీసులు అందించి తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే త్వరలో జరగబోయే అమ్మవార్ల పండగలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.