పార్వతీపురం మన్యం జిల్లాలో 42, 817 బంగారు కుటుంబాలు ఉన్నాయని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ కుటుంబాలను మార్గదర్శి (గైడ్)తో సమన్వయం చేయాలని ఆయన అన్నారు. శనివారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వర్క్షాప్ నిర్వహించి, కుటుంబాన్ని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం బంగారు కుటుంబాలను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసింది.