విజయనగరం లోని స్థానిక దుప్పాడ జంక్షన్ వద్ద గల శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయంలో చోరీ జరిగిందని అర్చకులు జయతి శ్రీనివాస శర్మ శుక్రవారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి పూజ అనంతరం ఆలయానికి తాళం వేసి వెళ్లిపోయానని, తిరిగి శుక్రవారం ఉదయం వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ద్వారం విరగ్గొట్టి హుండీల్లో డబ్బు కాజేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.