స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం విజయనగరం రీజనల్ బ్రాంచ్ కార్యాలయంలో రీజనల్ మేనేజర్ ఎం. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది సైతం రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.