విజయనగరం: టీడీపీ కార్యాలయంలో సంబరాలు

65చూసినవారు
విజయనగరం:  టీడీపీ కార్యాలయంలో సంబరాలు
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు గురువారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. అలాగే ఎస్.కోట దేవి గుడి జంక్షన్ వద్ద ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్ ఆధ్వర్యంలో కూడా తెదేపా కార్యకర్తలు కేక్ కట్ చేసి ఉత్సాహంగా సంబరాలు జరిపారు.

సంబంధిత పోస్ట్