అసాంఘిక శక్తుల అణచివేతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. ఈసందర్బంగా జిల్లాలోని ముఖ్య పట్టణాలైన విజయగరం, బొబ్బిలి, రాజాంలలో ఆకస్మికంగా 'స్టేటిక్ స్ట్రేంజర్ చెకింగ్' చేపట్టామన్నారు. ఆయా ప్రదేశాల్లో గుమిగూడిన వ్యక్తుల లగేజ్లు, బ్యాగుల్లో మద్యం, గంజాయి, డ్రగ్స్, బాంబులు, ఇతర ప్రేలుడు వస్తువుల గురించి కుణ్ణంగా తనిఖీ చేశారు.