విజయనగరం జిల్లా గ్రంథాలయ సేవా సంఘం నిర్వహిస్తున్న పుస్తకహుండీ కార్యక్రమానికి దాతల నుండి విశేష స్పందన లభిస్తుందని సంఘం ఉపాధ్యక్షులు కె. దయానంద్, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్ లు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ దిమిలి అచ్యుతరావు తన ఇంట్లో వున్న వివిధ రకాల పుస్తకాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో తమను సంప్రదించిన మేరకు శుక్రవారం వారి ఇంటికి వెళ్లి పుస్తకాలను స్వీకరించామని అన్నారు.