మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులలో భాగంగా విజయనగరం పట్టణంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా విజయనగరం ఆరో డివిజన్ రామకృష్ణ నగర్ లో 20 లక్షల వ్యయంతో సిసిరోడ్డు, బోత్ సైడ్ కాలువ నిర్మాణం విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.