కొత్తపేట కుమ్మరివీధి జంక్షన్ వద్ద గల హనుమాన్ విగ్రహం ప్రాంగణంలో సుమారు 35 మంది చిన్నారులతో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము చేయడం జరిగింది. ఉగ్రవాదులను సంహరించే ఆపరేషన్ సిందూర్ లో భారతీయ సైనికులకు అండగా ఆ అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి శ్రీరామ రక్ష గా నిలవాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు ఇమంది సుధీర్ ఆధ్వర్యంలో పారాయణము నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.