విజయనగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారన్నారు.