విజయనగరం క్షత్రియ కల్యాణ మండపంలో గురువారం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 11 ఏళ్లుగా దేశ సేవలో నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. దేశ రక్షణ, సంక్షేమం కోసం మోదీ కృషి అభినందనీయమన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత భారత్ వైపు ప్రపంచం చూస్తోందని పేర్కొన్నారు.