విజయనగరం: పురపాలక శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలి: సీపీఐ

74చూసినవారు
రోటరీ క్లబ్ సంస్థ శ్మశాన వాటిక నిర్మాణం చేసిన తరువాత పురపాలక శ్మశాన వాటికను అభివృద్ధి చేయకుండా గాలికొదిలేస్తారా అని సీపీఐ పార్టీ నాయకులు బుగత అశోక్ ప్రశ్నించారు. గురువారం కొత్తపేట కుమ్మరివీధిలో ఉన్న నగరపాలక శ్మశాన వాటిక వద్ద సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అశోక్ మాట్లాడుతూ. శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో మౌళిక సదుపాయాలతో అభివృద్ధి చేసి, ఎలక్ట్రికల్ బర్నింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు

సంబంధిత పోస్ట్