ప్రభుత్వ బీమా పథకాలపై సచివాలయ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సురక్ష భీమా యోజన, పీఎం జీవనజ్యోతి, అటల్ పెన్షన్ యోజన తదితర పథకాల ద్వారా ప్రజలు భీమా సౌకర్యం పొందాలని కోరారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ బీమా పథకాలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగకారిగా ఉంటుందని తెలిపారు.