విజయనగరం పట్టణంలోని ఉల్లివీధిలో క్రికెట్ బెట్టింగ్లపై ముట్టడి జరిగింది. ఎస్పీ ఆదేశాలతో సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో సోమవారం చేపట్టిన దాడుల్లో ఏడుగురు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహణపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.