విజయనగరం నుండి ఎస్ కోట వయా ధర్మవరం మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధరలు తగ్గించడం జరిగిందని ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ శనివారం తెలిపారు. ఇదివరకు విజయనగరం నుండి ఎస్ కోట వెళ్లే ప్రయాణికులకు రూ. 55/-ల నుండి రూ. 50/-లకు టికెట్ ధర తగ్గించడం జరిగింది మరియు కొన్ని స్టేజీలలో టికెట్ ధర స్వల్పంగా తగ్గడం జరిగింది.. కావున ప్రయాణికులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని కోరారు.