ఎస్సీ, ఎస్టీ దాడులపై నిర్వహించే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ప్రతి రెవెన్యూ డివిజన్లో మూడు నెలలకు ఒక సారి తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. అనంతరం సమావేశపు మినిట్స్ను జిల్లా కలెక్టర్కు పంపాలన్నారు. అక్కడి సమావేశంలోని అంశాలపై జిల్లా స్థాయి మోనిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు