రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం అన్నం రాజుపేటలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెదేపా నాయకులు, బూత్ ఇన్చార్జీలు ఇంటింటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు.